రూ.3 వేల కోసం హత్య..

by  |
రూ.3 వేల కోసం హత్య..
X

దిశ, వెబ్ డెస్క్: తాను ఇచ్చిన డబ్బులివ్వలేదని ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్టుగా నటించాడు. సెల్ ఫోన్ ద్వారా వివరాలు ఆరా తీసిన పోలీసులుకు నిందితుడు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం అక్కిరెడ్డిగూడెంకు చెందిన అనూష(30) అనే మహిళలకు ముగ్గురు పిల్లలున్నారు. అయితే ఈమె భర్త గతంలో మృతిచెందాడు. దీంతో ఆమె కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో ఈమెకు నాగులదేవిపాడుకు చెందిన గుజ్జుల సందీప్ అనే ఆటో డ్రైవర్ పరిచయమయ్యాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో అనూష అతని వద్ద నుంచి రూ. 3 వేలు అప్పుగా తీసుకుంది. వారం తర్వాత తాను అప్పుగా తీసుకున్న డబ్బులను ఇస్తానంటూ అనూష.. పెదవేగి మండలం 7వ మైలురాయి వద్దకు రావాలని సందీప్ తో చెప్పింది. దీంతో అతను జూలై 1న అక్కడికి వచ్చాడు. అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తాను ఇచ్చిన డబ్బులివ్వలేదని అనూషను సందీప్ చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని చెట్ల పొదల్లో విసిరేసి అక్కడి నుంచి సందీప్ పారిపోయాడు. అయితే ఏడు రోజుల తర్వాత జూలై 7న పోలవరం కుడి కాల్వ గట్టు కింద ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ ఆధారంగా వివరాలు సేకరించారు. దీంతో విషయం బయటపడింది. నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed