కరెంట్ షాక్‌తో చిరువ్యాపారి మృతి

by  |

దిశ, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో కరెంట్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం మెదక్‌ పట్టణానికి చెందిన వెంకటేశ్ ( 30 ) బఠాణీల తయారీ, పిండి గిర్నీ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం బఠాణీలు తయారు చేస్తున్న సమయంలో యంత్రానికి విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి అపస్మారక స్థితిలో వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.

Tags: crime news, Person killed, electric shock, medak

Next Story