నరికిన తలతో స్టేషన్ కు వెళ్లి..

by  |
నరికిన తలతో స్టేషన్ కు వెళ్లి..
X

దిశ,వెబ్ డెస్క్: భార్య తలను నరికి దాన్ని తీసుకొని వెళ్లి పోలిస్ స్టేషన్ లో లొంగి పోయాడు ఓ వ్యక్తి. ఈ ఘటన యూపీలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నార్ యాదవ్, విమల దంపతులు నేతానగర్‌లో నివాసం ఉంటున్నారు. కాగా ఇటీవల భార్యపై చిన్నార్ యాదవ్‌కు అనుమానం మొదలైంది. దీంతో గత కొంత కాలంగా భార్యా భర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది‌. మాట మాట పెరిగి గొడవ పెద్దదైంది. కోపంలో భార్య తలను చిన్నార్ యాదవ్ కత్తితో నరికాడు. దీంతో విమల అక్కడికక్కడే మరణించింది.

కాగా కోపం చల్లారిన తర్వాత జరిగిన విషయాన్ని గ్రహించాడు. వెంటనే భార్య తలను, కత్తిని తీసుకుని వెళ్లి పోలీసు స్టేషన్ లో వెళ్లి లొంగిపోయాడు. విమల మృత దేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed