పాడి గేదెను రక్షించబోయి రైతు మృతి

by Shyam |

<p>దిశ, నల్లగొండ: బావిలో పడిన పాడి గేదెను రక్షించబోయి రైతు మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కత్తి రాంబాబు(55)కు చెందిన పాడి గేదె వ్యవసాయ బావిలో పడిపోయింది. మరో ముగ్గురి సహాయంతో దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. తాళ్ల సహాయంతో గేదెను పైకి లాగుతున్న క్రమంలో రాంబాబు జారి బావిలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి [&hellip;]</p>

దిశ, నల్లగొండ: బావిలో పడిన పాడి గేదెను రక్షించబోయి రైతు మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కత్తి రాంబాబు(55)కు చెందిన పాడి గేదె వ్యవసాయ బావిలో పడిపోయింది. మరో ముగ్గురి సహాయంతో దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. తాళ్ల సహాయంతో గేదెను పైకి లాగుతున్న క్రమంలో రాంబాబు జారి బావిలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Suryapeta,Ones death, Well, police

Next Story