కారు బైకు ఢీకొని యువకుడు మృతి

by  |

దిశ, నల్లగొండ: కారు, బైక్ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన చండూరు మండలం తెరటుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం తెరటుపల్లి, గట్టుప్పల్ గ్రామాల మధ్య కారు, బైకు ఢీకొన్నాయి. దీంతో తెరటుపల్లికి చెందిన బొట్ట హరిప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన నిందితులు కారును వదిలేసి పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఉపేంద‌ర్‌రెడ్డి తెలిపారు.

Tags: car hit bike, munugodu, person died, overspeed

Next Story

Most Viewed