స్నేహితుడి ప్రాణం తీసిన ర్యాష్ డ్రైవింగ్..

by  |
స్నేహితుడి ప్రాణం తీసిన ర్యాష్ డ్రైవింగ్..
X

దిశ, మరిపెడ : ద్విచక్ర వాహనం పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం.. గుండెపూడి గ్రామానికి చెందిన ఆజ్మీరా ఉపేందర్ (19), అతని మిత్రుడు బర్మావత్ మహేందర్ ఇద్దరూ మహేందర్ బండిపై ఉపేందర్ సోదరి ఇంటికి పాంబండ తండాకు దసరా పండగ కోసం వెళ్లారు.

తిరిగి రాత్రి గుండెపూడికి వస్తుండగా శివారులో అతివేగంగా, అ జాగ్రత్తగా మహేందర్ బైక్ నడపడంతో వెనుకాల కూర్చున్న ఉపేందర్ ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఉపేందర్ తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఉపేందర్ మృతికి కారణమైన మహేందర్ పై మృతుని తండ్రి అజ్మీరా బద్రు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story

Most Viewed