చిల్లర డబ్బుల కోసం కొట్లాట.. స్నేహితుడి హత్య

by  |
చిల్లర డబ్బుల కోసం కొట్లాట.. స్నేహితుడి హత్య
X

దిశ, నిజామాబాద్: ముగ్గురు మిత్రులు సంతోషంగా మందు పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన డబ్బుల విషయంలో ఇద్దరు మిత్రులకు మధ్య మాటా మాటా పెరిగింది. విచక్షణ కోల్పొయిన ఓ వ్యక్తి ఇంకొక వ్యక్తిని కర్రతో బలంగా తలపై బాదాడు.రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని ఆరవ పట్టణ పోలీసు స్టేషన్‌లో పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.పోలీసుల కథనం ప్రకారం..జిల్లా నగర శివారు నెహ్రు నగర్‌లోని రాజ్ కాస్టింగ్ యూనిట్‌లో గత కొన్నేండ్లుగా యూపీకి చెందిన అరవింద్ యాదవ్, రామ శంకర్, వికాస్ పటాక్ లు కూలీలుగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ముగ్గురు కలిసి దావత్ చేసుకున్నారు. పార్టీ అనంతరం మిగిలిన డబ్బుల విషయంలో వికాస్ పాఠక్, అరవింద్ యాదవ్ మధ్య గొడవ నెలకొంది. ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో అరవింద్ యాదవ్ పక్కన దొరికిన కర్రతో వికాస్ పటాక్ తల మీద బలంగా కొట్టాడు. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న నెహ్రు నగర్ సర్పంచ్ ఆరవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలిని మంగళవారం అదనపు డీసీపీ రఘు వీర్, ఎసీపీ శ్రీనివాస్, సీఐ రఘునాథ్ పరిశీలించారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించి, మృత దేహాన్నిశవ పంచనామా కొరకు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ గౌరవేందర్ తెలిపారు.



Next Story

Most Viewed