ఇంట్లోంచి నగదుతో వెళ్లిన వ్యక్తి బావిలో శవమై..

by  |
ఇంట్లోంచి నగదుతో వెళ్లిన వ్యక్తి బావిలో శవమై..
X

దిశ, మేళ్లచెరువు : ఇంట్లో నుంచి నగదుతో వెళ్లిన యువకుడు బావిలో శవమై కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకెళితే.. ఉమ్మడి నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలంలోని రేవూరు గ్రామానికి చెందిన భూతం మణికిరణ్‌ (21) మేళ్లచెరువులోని ఫ్రెండ్స్‌ దాబాలో క్యాషియర్‌‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 11వ తేదీన తన ఇంట్లో నుండి కొంత నగదును తీసుకొని తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు.

అతని కోసం గాలించిన కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం లభించలేదు. కాగా, గురువారం సాయంత్రం మేళ్లచెరువు శివారులోని కర్నే ప్రతాపరెడ్డి వ్యవసాయ బావిలో శవమై తేలాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తాను ఇంట్లో చెప్పకుండా తీసుకువెళ్లిన డబ్బులు తన అవసరాలకు ఖర్చు చేసుకుని తిరిగి ఇంటికి వస్తే తన కుటుంబ సభ్యులు తనను మందలిస్తారని భయంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ జయాకర్‌ విలేఖరులకు తెలిపారు.

Next Story

Most Viewed