గొంతునులిమి తల్లి హత్య.. తనయుడి రిమాండ్!

by  |
గొంతునులిమి తల్లి హత్య.. తనయుడి రిమాండ్!
X

దిశ, ఆందోల్ : మద్యానికి బానిసైన ఓ తనయుడు కన్నతల్లిని గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఎస్ ఇటిక్యాల గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. జోగిపేట సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఇటిక్యాల గ్రామానికి చెందిన సాలె సత్యమ్మ గత కొంత కాలంగా పక్షవాతంతో మంచానికి పరిమితమైంది. ఆమె కొడుకు పెంటయ్య మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి తల్లితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం మద్యం మత్తులో తల్లితో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

రాత్రి వచ్చాక సత్యమ్మ ఒంటిపై ఉన్న బంగారం ఇవ్వాలని పెంటయ్య అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో గొంతు నులిమి దారుణంగా హతమార్చాడు. అనంతరం బంగారు గుండ్లతో పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 24 గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Next Story