- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: లాక్డౌన్ నిబంధనలు సడలించి అంతర్రాష్ట్ర ప్రయాణాలకు రాష్ర్టం ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు భారీగా పెరిగాయి. కాగా తెలంగాణ నుంచి ఏపీలోనికి వెళ్లేవారికి పాస్లు ఉంటేనే ఆ రాష్ట్ర పోలీసులు అనుమతిస్తున్నారు. లేనివారి ఆధార్ సంఖ్యలు నమోదు చేసుకొని.. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం హోం క్యారంటైన్ ముద్ర వేసి అనుమతిస్తున్నారు. నాగార్జునసాగర్ సరిహద్దు వద్ద తెలంగాణ నుంచి గుంటూరు జిల్లా మాచర్లకు పత్తి విత్తనాల కోసం వెళ్లిన వారిని అనుమతించడం లేదు. పత్తి విత్తనాల ఏజెంట్లను రైతుల వద్దకు పంపిస్తామని.. ఎవరూ అనుమతి లేకుండా రావొద్దంటూ ఇరు రాష్ట్రాల పోలీసులు సూచిస్తున్నారు. సరిహద్దుల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
Next Story