పాస్‌లు ఉంటేనే ఏపీలోకి అనుమతి

by  |
పాస్‌లు ఉంటేనే ఏపీలోకి అనుమతి
X

దిశ, నల్లగొండ: లాక్​డౌన్​ నిబంధనలు సడలించి అంతర్రాష్ట్ర ప్రయాణాలకు రాష్ర్టం ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు భారీగా పెరిగాయి. కాగా తెలంగాణ నుంచి ఏపీలోనికి వెళ్లేవారికి పాస్​లు ఉంటేనే ఆ రాష్ట్ర పోలీసులు అనుమతిస్తున్నారు. లేనివారి ఆధార్​ సంఖ్యలు నమోదు చేసుకొని.. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం హోం క్యారంటైన్ ముద్ర వేసి అనుమతిస్తున్నారు. నాగార్జునసాగర్​ సరిహద్దు వద్ద తెలంగాణ నుంచి గుంటూరు జిల్లా మాచర్లకు పత్తి విత్తనాల కోసం వెళ్లిన వారిని అనుమతించడం లేదు. పత్తి విత్తనాల ఏజెంట్లను రైతుల వద్దకు పంపిస్తామని.. ఎవరూ అనుమతి లేకుండా రావొద్దంటూ ఇరు రాష్ట్రాల పోలీసులు సూచిస్తున్నారు. సరిహద్దుల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.



Next Story

Most Viewed