మూగబోయిన ప్రజాగొంతుక..

by  |
మూగబోయిన ప్రజాగొంతుక..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ ప్రజాగాయకుడు,కళాకారుడు పైలం సంతోష్(43) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆదివారం ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. పైలం సంతోష్ నల్గొండ జిల్లా దుగునెల్లి మండలం కట్టంగూర్ స్వగ్రామానికి చెందిన వాడు.

ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ సంతోష్‌కు ఘనంగా నివాళ్లు అర్పించారు.

Next Story

Most Viewed