సూర్యాపేటలో ఫుల్ జనం.. కల్నల్‌కు సలాం

by  |
సూర్యాపేటలో ఫుల్ జనం.. కల్నల్‌కు సలాం
X

దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేటలోని విద్యానగర్ కు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో కల్నల్ సంతోష్ బాబు ఇంటి చేరుకుని ఆయన పార్థివదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ సమయంలో కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరుడు సంతోష్ బాబు మరణం వృథా కాదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా చైనాకు కేంద్ర ప్రభుత్వం సరైనా బుద్ధి చెప్పాలని మండిపడుతున్నారు. కాగా, కాసేపట్లో ఆర్మీ ప్రత్యేక వాహనంలో సంతోష్ బాబు అంతిమయాత్ర చేపట్టనున్నారు.

Next Story

Most Viewed