పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు

by  |
పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు
X

దిశ, పటాన్ చెరు: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ‌ఇస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురువారం ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీలో అందరూ సమర్థులైన నాయకులు ఉన్నారని తెలిపారు . ప్రతి కార్యకర్తనూ కడుపులో పెట్టుకొని పార్టీ చూసుకుంటుందని అన్నారు.

టీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించే ఆశావాహులు ఎక్కువగా ఉంటే, అభ్యర్థులు దొరక్క టీఆర్ఎస్ నుండి ఎవరైనా వస్తారా అన్న దయనీయ స్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల అప్పుడు మాత్రమే రాజకీయాలు చేసే పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. టికెట్ దక్కని ఆశావహుల అందరికీ పార్టీ భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తుందని అన్నారు.

Next Story

Most Viewed