‘సామాజిక దూరం పాటించండి’

by  |
‘సామాజిక దూరం పాటించండి’
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. లింగాల మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ.. ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అలాగే, వైరస్ నిర్మూలనకు శానిటేషన్ మందును పిచికారీ చేయించారు. ఆయన వెంట లింగాల గ్రామ సర్పంచ్ కోనేటి తిరుపతయ్య వున్నారు.

Tags: mla guvvala balaraju, social distance, corona, virus, lingala, lockdown,

Next Story