ఎవరూ రోడ్లపైకి రావొద్ద్దు: మంత్రి అజయ్

by  |
ఎవరూ రోడ్లపైకి రావొద్ద్దు: మంత్రి అజయ్
X

దిశ‌, ఖమ్మం: కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు ప్రజలంతా సహకరించాలనీ, అత్యవసరముంటే తప్ప ఎవరూ రోడ్లపైకి రావొద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఖమ్మంలోని ఓ డివిజన్‌లో నిర్వహించిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. లాక్‌ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సీఎం కేసిఆర్ సంకల్పానికి అందరూ బాసటగా నిలవాలని కోరారు. నగరంలోని 13, 26వ డివిజన్లలో తమవంతు సాయంగా పేదలు, వితంతు కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసిన కార్పొరేటర్లకు అభినంద‌నలు తెలిపారు.

tags: khammam, minister, puvvada ajay kumar, corona, virus, lockdown, rice distribution,

Next Story

Most Viewed