టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి నిరసన సెగ.. ఆయన ముందే డౌన్ డౌన్ అంటూ నినాదాలు

by  |
MLA-1
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్టు: అబ్దుల్లాపూర్ మెట్టు మండలం తారామతిపేట్ లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. శనివారం అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని తారామతి పెట్ గ్రామస్తులు అడ్డుకున్నారు. తారామతి పెట్ లో నిర్మించిన డంపింగ్ యాడ్ తో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కల్పించుకొని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం వివిధ గ్రామాలలో కావాడిపల్లి, బలిజగుడ, తారామతి పెట్, బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్ లలో రూ.3,27,10,000 వ్యయంతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రేఖ, గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MLA-2



Next Story

Most Viewed