ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలి: సీపీ జోయల్ డేవిస్

by  |
ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలి: సీపీ జోయల్ డేవిస్
X

దిశ, మెదక్: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పొడిగించిన లాక్‌డౌన్‌ను ప్రజలు తప్పక పాటించాలని సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ అన్నారు. అలాగే, లాక్‌డౌన్ సమయంలో అహర్నిశలు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సహకరించాలని సూచించారు. మే 29 వరకు సడలించిన లాక్‎డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాధి నివారణ గురించి కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిబంధనలను ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ జోయల్ డేవిస్ హెచ్చరించారు.

tag: CP Joel Davis, comments, lockdown, siddipet

Next Story

Most Viewed