ఆ పని చేస్తామని రూ. కోటికిపైగా కొట్టేసిన కేటుగాళ్లు.. చివరకు ఏమైందంటే..?

by  |
ఆ పని చేస్తామని రూ. కోటికిపైగా కొట్టేసిన కేటుగాళ్లు.. చివరకు ఏమైందంటే..?
X

దిశ, మంచిర్యాల: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు మంచిర్యాల పోలీసులు. సింగరేణిలో మెడికల్ అన్ ఫిట్ చేయిస్తాం, సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెట్టుబడుల పేరిట ఒక రూ. కోటి 61 లక్షల 20 వేలు తీసుకొని మోసానికి పాల్పడిన ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో మారగోని శ్రీనివాస్ గౌడ్, నక్క రాజా జ్ఞానిసాగర్, గుసుకొండ రవికాంత్ శర్మలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed