రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు : జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న

by  |
రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు : జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న
X

దిశ, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు అభివృద్ధి చెందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అన్నారు. సోమవారం రోజున మండ‌ల కేంద్రం, నారక్కపేట‌తో పాటు మండలంలో ఉన్న మిగతా 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రాంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులకు కోసం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్య మంత్రి కేసీఆర్‌ రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉడుగుల సునీత ప్రవీణ్ ప్యాక్స్ చెర్మెన్ చెట్టుపెల్లి మురళి, ప్యాక్స్ డైరెక్టర్స్, రైతు సమన్వయ సమితి బాద్యులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed