- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, కరీంనగర్: వామనరావు దంపతుల హత్య కేసులో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు మిస్సింగ్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో మరోసారి తెరపైకి వచ్చిన పుట్టా మధు గతకొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కోసం గాలిస్తున్న పోలీసులు తాజాగా.. ఆంధ్రప్రదేశ్ భీమవరంలో ఓ హోటల్లో ఆయనను రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. ఆయనపై ఉన్న కేసులు సహా కనిపించకుండాపోవడం వెనుక కారణాలపై పోలీసుల ఫోకస్ పెట్టారు. ఈటల భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే మధు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. హైకోర్టు న్యాయవాదులు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడంతో ఈ కేసు విషయంలో భయంతోనే పుట్టా మధు కనిపించకుండా పోయారన్న ప్రచారం కూడా జరుగుతుంది.