- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : అభినవ్ సర్దార్, రామ్, చాందిని తమిలరసన్, షెర్రీ అగర్వాల్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం ‘పీనట్ డైమండ్’. రెండు కాలమానాలకు సంబంధించిన వైవిధ్యమైన కథాంశంతో డైరెక్టర్ వెంకటేశ్ తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి. దర్శకులు వెంకటేశ్ తనకు చాలా కాలంగా తెలుసన్న మారుతి.. వెరీ టాలెంటెడ్ పర్సన్ అని కొనియాడారు. సైన్స్ ఫిక్షన్ జోనర్లో వస్తున్న ‘పీనట్ డైమండ్’ను చాలా చక్కగా డీల్ చేశారని తెలిపారు.
1989లో జరుగుతున్న ఒక కథను… 2020లో జరుగుతున్న మరో స్టోరిని..ప్యారలల్గా చూపించడంలో సక్సెస్ అయ్యాడని తెలిపారు. అసలు ఈ రెండు కథలకున్న సంబంధం ఏంటి? అనేది సినిమా చూస్తే ఐడియా వస్తుందన్న నిర్మాతలు అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ..మూవీ ఆడియన్స్ సూపర్ థ్రిల్ ఇస్తుందన్నారు. హైదరాబాద్, తమిళనాడు, కేరళ, వైజాగ్ సినిమా చిత్రీకరణ చేయగా.. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందన్నారు. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని వెల్లడించారు.