ధ్యానంతో మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి పెరుగుదల

by  |
ధ్యానంతో మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి పెరుగుదల
X

దిశ,ఆర్మూర్: సోమవారం నందిపేట మండలం వన్నెల్ కే గ్రామంలో శ్రీ నాగశేషు పిరమిడ్ ధ్యాన మందిరంకు గ్రాండ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మినుగు రణవీర్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసినారు. పెద్దబీర అనసూయ హనుమాన్లు ఇంటివద్ద భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..”ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, ధ్యానం చెయ్యడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. యోగ ద్వారా మానసిక ప్రశాంతత మరియు శరీరంలోని అవయవాల పనితీరు మెరుగు అవుతుందని తెలిపారు. పిరమిడ్ శక్తి ఉపయోగించుకోవాలని రణవీర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్ సాయికృష్ణ రెడ్డి, మాస్టర్ అభిలాష్, గణేష్, గజేండర్, మాస్టర్ సంజయ్, నవీన్ ధ్యాన బంధువులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed