రామతీర్థం ఘటన నిందితులను త్వరగా పట్టుకోవాలి

by  |
రామతీర్థం ఘటన నిందితులను త్వరగా పట్టుకోవాలి
X

దిశ, విశాఖపట్నం: రామతీర్థం బయల్దేరిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌‌ని బుధవారం విజయనగరంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై మండిపడ్డారు.

అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ.. రామతీర్థం నిందితులను త్వరగా పట్టుకోవాలని, రాజకీయాలకు మతాలను అడ్డు పెట్టుకోవద్దని డిమాండ్ చేశారు. రామతీర్థంలో రెవెన్యూ యంత్రాంగం సెక్షన్‌ 30ను ప్రయోగించడం సరికాదన్నారు. రామతీర్థంలో ర్యాలీలు, సభలు నిర్వహించాలంటే పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరి అని చెబుతునే.. అధికార పార్టీ నేతలను రామతీర్ధానికి పంపించారో తెలపాలని డిమాండ్ చేశారు. హిందు దేవాలయాలు, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్న వైసీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం లేదని విమర్శించారు.



Next Story

Most Viewed