ఆ కారణంగానే ప్రచారానికి ఆమె దూరంగా ఉన్నారు..

by  |
ఆ కారణంగానే ప్రచారానికి ఆమె దూరంగా ఉన్నారు..
X

దిశ, వెబ్ డెస్క్: దుబ్బాకకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు చేసిందేమి లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే దుబ్బాక అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. మంత్రి హరీశ్ రావు, రఘునందన్ రావులు అన్నదమ్ములని ఆయన అన్నారు. మంత్రి హరీశ్ రావుకు రఘునందన్ రావు బినామి అని ఆయన ఆరోపించారు. తమ పార్టీనేత విజయశాంతితో తాను మాట్లాడానని చెప్పారు. కరోనా కారణంగా ఆమె ప్రచారానికి దూరంగా ఉన్నారని చెప్పారు. విజయశాంతికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మీడియా పిచ్చి రాతలు రాస్తోందని ఆయన మండి పడ్డారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed