చీవాట్లు పెట్టినా కూడా..

by  |
చీవాట్లు పెట్టినా కూడా..
X

దిశ, మెదక్: తెలంగాణలో జీతాల కోతపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని తెలంగాణ పీటీఎఫ్(ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్) తీవ్రంగా ఖండించింది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతుందన్నారు. వెంటనే కోత విధించిన జీతాలను విడుదల చేయాలని, అలాగే జూన్ నెలకు పూర్తి వేతనాలు, పెన్షన్లు బేషరతుగా ఇవ్వాలని తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed