‘నివర్’ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన..

by  |
‘నివర్’ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో నివర్ తుఫాన్ సృష్టించిన బీభత్సం గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా పడింది.

ఈ నేపథ్యంలోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల జిల్లాల నాయకులతో క్షేత్రస్థాయి పరిస్థితులపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం చర్చించారు. నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు పవన్ డిసెంబర్ 2వ తేదీన ఆయా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని జనసేన నాయకులు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed