ఆయన త్వరగా తిరిగొస్తారనే నమ్మకం ఉంది : పవన్

by  |
ఆయన త్వరగా తిరిగొస్తారనే నమ్మకం ఉంది : పవన్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గురువారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఐసీయూలోకి మార్చి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రఖ్యాత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో ఆత్మస్థైర్యం ఉన్న వ్యక్తి .. ఆయన వీలైనంత త్వరగా కోలుకుని మన ముందుకు వస్తారన్న విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

చెన్నైలోని ఎంజీఎంలో బాలు లైఫ్ సపోర్ట్ తో ఉన్నారని నిన్న తెలియగానే, ఆత్మస్థైర్యం నిండుగా ఉన్న ఆయన తప్పకుండా కోలుకుంటారని భావించానని పవన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారని, ఇది ఎంతో ఊరటనిచ్చే వార్త అని వెల్లడించారు. మెగా కుటుంబానికి బాలు ఎంతో సన్నిహితుడని, ఆయన ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు పవన్ కోరారు.



Next Story

Most Viewed