- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. పదేళ్లుగా అక్కడ పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందరికే పని కల్పించటం దారుణమన్నారు. ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించవద్దని ఆలయ అధికారులకు సూచించారు. కరోనా సమయంలో ఆలయాన్ని మూసేసినప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ విధులకు దూరంగా ఉంచి.. తిరిగి ఆలయం ప్రారంభించినప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందరిని మాత్రమే విధులకు పిలిచి, మరి కొందరికి సమాచారమే ఇవ్వలేదని పవన్ ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించి వారి వివరాలను సంబంధిత కార్పొరేషన్లో నమోదు చేయించేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
Next Story