ముంపులో 200 గ్రామాలు: పవన్

by  |
ముంపులో 200 గ్రామాలు: పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి వరదలపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. దాదాపు 200 లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయని.. 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పాలు దొరకకా పసిపిల్లలు అల్లాడుతున్నారని అన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

పోలవరం పూర్తి కాకపోవడంతోనే భారీ స్థాయిలో వరదలు వచ్చాయని..వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని పవన్ కోరారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed