- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : మహత్మాగాంధీ జయంతి సందర్భంగా శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించారు. ఈ నేపథ్యంలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో అక్కడికి పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పవన్ కార్యక్రమం నేపథ్యంలో రాజమహేంద్రవరంలో పోలీసులు ఆంక్షలు విధించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయినప్పటికీ శ్రమదానంలో పాల్గొనాలని పవన్ నిర్ణయించారు.
హుకుంపేట-బాలాజీపేట రహదారిపై శ్రమదానం తర్వాత పవన్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే, సభా ప్రాంగణానికి చేరుకునే దారులన్నింటినీ పోలీసులు మూసివేశారు. సభకు అన్ని వైపులా 5 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు.
#JanaSenaSramadaanam pic.twitter.com/T8sAwCUmng
— Janasena Soldiers✊🏼🔥 (@jssoldiers) October 2, 2021