తాట తీసి మోకాళ్లపై కూర్చోబెడతాం.. జాగ్రత్త: పవన్ హెచ్చరిక

by  |
తాట తీసి మోకాళ్లపై కూర్చోబెడతాం.. జాగ్రత్త: పవన్ హెచ్చరిక
X

దిశ, ఏపీ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఢంకా భజాయించబోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పవన్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని ఈ విషయంపై తేల్చుకునేందుకు వైసీపీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తాట తీసి మోకాళ్లపై కూర్చోబెడతామని పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఏ వైసీపీ నాయకుడు ఇబ్బంది పెడుతున్నాడో అవన్నీ గుర్తుపెట్టుకోవాలని దానికి బదులివ్వాలని పవన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వశాఖలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయని ఇది రాసిపెట్టుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు వైసీపీకి కౌరవ సభ చూపించామని రాబోయే రోజుల్లో పాండవ సభ ఏంటో చూపిస్తామని ఘాటుగా హెచ్చరించారు.

Next Story

Most Viewed