సమావేశాలు ఎక్కడ పెట్టినా అక్కడికి వస్తాం: పవన్

by  |
సమావేశాలు ఎక్కడ పెట్టినా అక్కడికి వస్తాం: పవన్
X

దిశ,వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లోపు రైతులకు సాయం అందించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మచిలీపట్నం రోడ్ షోలో పవన్ కళ్యాణ్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎకరాకు రూ.10వేలు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని అన్నారు. రైతులకు సాయం చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ పెట్టినా అక్కడికి వస్తామని తెలిపారు. రైతు కన్నీళ్లు తుడవలేనప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకని మండి పడ్డారు. సినిమాలు చేస్తూ..రాజకీయం చేయకూడదా అని ప్రశ్నించారు. రెచ్చగొట్టే రాజకీయం పద్దతి కాదని పేర్కొన్నారు.



Next Story

Most Viewed