- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల ప్రాణాలూ విలువైనవే: పవన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: పదోతరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. ఈ నేపథ్యంలో పవన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘కరోనా వైరస్ వ్యాప్తి సాకుతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులకే కుదించింది. కానీ, అదే ప్రభుత్వం పదో తరగతి పరీక్షలకు ఎలాంటి ఆటంకం లేదని ప్రకటించింది. ఈ ప్రభుత్వం ఎంతో తెలివైనది’ అంటూ ఎద్దేవా చేశారు. టెన్త్ క్లాస్ విద్యార్థులకు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: పదోతరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు.
ఈ నేపథ్యంలో పవన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘కరోనా వైరస్ వ్యాప్తి సాకుతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులకే కుదించింది. కానీ, అదే ప్రభుత్వం పదో తరగతి పరీక్షలకు ఎలాంటి ఆటంకం లేదని ప్రకటించింది. ఈ ప్రభుత్వం ఎంతో తెలివైనది’ అంటూ ఎద్దేవా చేశారు.
టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఓటు హక్కు ఉండదన్న విషయం తెలుసు కాబట్టే కరోనా రోజుల్లోనూ పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. అంతేకాదు, ‘పదో తరగతి విద్యార్థుల ప్రాణాలూ విలువైనవే’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు.
Next Story






