- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్ : ఇటీవల అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కోసం ఒక మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రతిపాదనపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ధోని కోసమే కాకుండా రిటైర్ అయిన అందరి కోసం ఒక చారిటీ మ్యాచ్ నిర్వహించాలని పఠాన్ కోరాడు.
గతంతో క్రికెట్కు వీడ్కోలు పలికిన దిగ్గజాలందరినీ ఒక జట్టుగా చేర్చి కొహ్లీ సేనతో ఒక మ్యాచ్ ఆడించాలని పఠాన్ ప్రతిపాదించాడు. గతంలో రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్, అంబటి రాయుడు, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ వంటి క్రికెటర్లతో కూడిన జట్టును ప్రస్తుత టీం ఇండియా జట్టుతో ఆడించాలని పఠాన్ సూచించాడు. మహీ వీడ్కోలు మ్యాచ్ గురించి నడుస్తున్న చర్చతో అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా పఠాన్ ఈ ప్రతిపాదన చేశాడు. ట్విటర్ వేదికగా సెండాఫ్ లేని ఆటగాళ్ల జాబితాను కూడా పంచుకున్నాడు.