పార్లమెంటులో ‘ఢిల్లీ హింస’ రగడ

by  |
పార్లమెంటులో ‘ఢిల్లీ హింస’ రగడ
X

న్యూఢిల్లీ : పార్లమెంటులో ఢిల్లీ హింసపై ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగాయి. దీంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే ఉభయ సభలు మధ్యాహ్నం రెండింటి వరకు వాయిదా పడ్డాయి. ఢిల్లీ హింసపై సమాధానాలివ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ధర్నాలు చేశారు. గాంధీ విగ్రహం దగ్గర వేర్వేరుగా ఆందోళన చేశారు. కొందరు ఎంపీలు కళ్లకు గంతలు కట్టుకుని నోటిపై వేళ్లు వేసుకుని మౌన ప్రదర్శన చేయగా.. ఇంకొందరు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న ప్లకార్డులను పట్టుకుని నిరసనలు చేశారు. బీజేపీ డౌన్ డౌన్ అని ఆప్ ఎంపీలు నినాదాలిచ్చారు.

Tags : parliament, budget session, adjourned, MP’s protest

Next Story

Most Viewed