- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: వూట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న టాలెంట్ షో ‘హునార్బాజ్ దేశ్ కీ షాన్’. ఈ షోలో కరణ్ జోహార్, మిథున్ చక్రవర్తితో కలిసి బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా న్యాయనిర్ణేతగా కనిపించనుంది. రీసెంట్గా విడుదలైన ప్రోమోలో.. తన ప్రదర్శనతో మెప్పించిన కంటెస్టెంట్ హునార్బాజ్ లైఫ్ స్టోరీ విన్న పరిణీతి భావోద్వేగానికి గురైంది. ‘ఏ దిల్ హై ముష్కిల్’ మూవీలోని పాటతో జడ్జిల హృదయాలు గెలుచుకున్న హునార్బాజ్.. ప్రదర్శన తర్వాత తన కుటుంబ నేపథ్యం గురించి వివరించాడు.
‘ఇక్కడకు చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. నేనొక నిరాశ్రయుడిని. చెట్లకిందే జీవితం గడుపుతున్నాను. ప్రతీరోజు ఎవరైనా ఆహారం ఇచ్చేలా చూడాలని దేవున్ని ప్రార్థించేవాడిని’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి దీనగాథపై స్పందించిన నటి.. ‘ఇలాంటి హృదయవిదారక కథలు మనసుకు గాయం చేస్తాయి. కానీ ప్రతిభ ఉంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయి సరైన స్థానానికి చేరుకున్నాడు’ అంటూ కన్నీరు పెట్టుకుంది.