రంగారెడ్డిలో దారుణం.. పంచాయతీ కార్మికుడి ఊపిరి తీసిన నీటి గుంత

by  |
రంగారెడ్డిలో దారుణం.. పంచాయతీ కార్మికుడి ఊపిరి తీసిన నీటి గుంత
X

దిశ, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి పంచాయతీ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని కేశంపేట మండల పరిధిలోని దేవుని గుడి తండాలో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. గుడి తండాలో నివసిస్తున్న గోపాల్ (53) స్థానికంగా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తు్న్నాడు. ఉదయం తాగు నీటి ట్యాంక్ వద్ద నీటి సరఫరాను చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఊపిరాడక మృతి చెందాడు. మృతుడి భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కేశంపేట ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.



Next Story

Most Viewed