పాన్-ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగించిన ప్రభుత్వం!

by  |
పాన్-ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగించిన ప్రభుత్వం!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించే గడువును కేంద్రం పొడిగిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. కరోనా మహమ్మారి ఆటంకాల నేపథ్యంలో ప్రజలు పాన్-ఆధార్‌తో అనుసంధానం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గమనించామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ తెలిపింది.

గతంలో మార్చి 31 వరకు గడువును పొడిగిస్తూ వచ్చిన ప్రభుత్వం, అనుసంధానం చేయని వారికి లేట్ ఫీజు కింద రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. ప్రస్తుత పొడిగింపు తర్వాత ప్రతి ఒక్కరూ పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోతే బ్యాంకు అకౌంట్ తెరిచేందుకు, పెన్షన్, స్కాలర్‌షిప్, ఎల్‌పీజీ సబ్సిడీ వంటి ప్రభుత్వ ప్రయోజనాలను పొందడంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.



Next Story

Most Viewed