పారిశుద్ధ్య కార్యక్రమాలను జయప్రదం చేయండి

by  |
పారిశుద్ధ్య కార్యక్రమాలను జయప్రదం చేయండి
X

దిశ‌,ఖ‌మ్మం : సోమవారం నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి అన్నారు. గతంలో నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. అదే స్ఫూర్తితో సోమవారం నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని శ్రమదానం చేప‌ట్టాల‌న్నారు. సీజ‌నల్ వ్యాధుల‌ను అరిక‌ట్టేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.

Next Story

Most Viewed