పాలేరు ఎమ్మెల్యే కందాళ భారీ సభకు మంత్రి కేటీఆర్..

by  |
పాలేరు ఎమ్మెల్యే కందాళ భారీ సభకు మంత్రి కేటీఆర్..
X

దిశ, పాలేరు : ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ నాయకులు స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో గురువారం హైదరాబాద్‌కు వచ్చి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. పాలేరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారని తెలిపారు. అదే రోజు నూతనంగా నిర్మించనున్న మద్దులపల్లి మార్కెట్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణులు వెల్లడించారు. తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల వారు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని వివరించారు.

నియోజకవర్గంలో రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి పలు రహదారులకు మరమ్మతులు చేయించారన్నారు. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో జరిగే బహిరంగసభకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ సభకు హాజరవుతారని ఇంటూరి శేఖర్, బెల్లం వేణు తెలిపారు. త్వరలోనే బహిరంగ సభ తేదీని ప్రకటిస్తామని, ఈ సభకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed