వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

by  |
వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలోని అన్నారం, గుమ్మడిదలలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చేనెల 5 నుంచి ఎరువుల విక్రయాలను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని వెల్లడించారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా రైతులకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ సద్ది ప్రవీణ, జెడ్పీటీసీ కుమార్‌గౌడ్, సర్పంచ్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Tags: pady purchasing centre, opening, mla mahipal reddy, medak, ts news


Next Story