‘పద్మ శ్రీ’ అందుకున్నాక కంగన కామెంట్స్.. ట్విట్టర్ ట్రెండింగ్‌లో టాప్

by  |
‘పద్మ శ్రీ’ అందుకున్నాక కంగన కామెంట్స్.. ట్విట్టర్ ట్రెండింగ్‌లో టాప్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ఢాకడ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, సోమవారం తను ‘పద్మ శ్రీ’ అవార్డును అందుకోవడానికి ఢిల్లీకి వెళ్లింది. ‘తలైవి’ సినిమాకు గాను భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారాన్ని నవంబర్ 8న రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు కంగనా. పద్మ శ్రీ పురస్కారం అందుకున్న కొద్ది నిమిషాల్లోనే ఇండియా ట్విట్టర్ ట్రెండింగ్ చార్ట్‌లో కంగనా రనౌత్ అగ్రస్థానంలో నిలిచారు. ఆమె గర్వించదగిన క్షణాన్ని షేర్ చెయ్యడానికి ఇన్‌స్టాగ్రామ్‌ ను వేదికగా చేసుకుంది. “ఈ గొప్ప గౌరవానికి వినయపూర్వకంగా ‘పద్మ శ్రీ’.. నా గురువుకు అలాగే తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.

జయలలిత బయోపిక్ ‘తలైవి’లో చివరిగా కనిపించిన కంగనా, అంతకుముందు మణికర్ణిక, పంగా చిత్రాలలో తన నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో కంగనా నాలుగోసారి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. మణికర్ణిక : క్వీన్ ఆఫ్ ఝాన్సీ , పంగా చిత్రాలలో ఆమె నటనకు ఉత్తమ నటి అవార్డును అందుకుంది. జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్న తర్వాత, కంగనా రనౌత్ ఇలా రాసుకొచ్చింది. “మనమందరం తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణ అలాగే త్యాగాలకు తగినట్లుగా ఉండాలనే ప్రగాఢమైన కోరికతో పెరుగుతాం.. అన్ని కష్టాల తర్వాత నేను నా తల్లి, పిల్లలకు అలాంటి రోజులను ఇస్తాను. అలాంటి కష్టాలన్నింటినీ ఎదుర్కోండి. ఇన్ని రోజులు నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు అని పేర్కొంది.


Next Story