- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: బాలీవుడ్ నటి కంగనా రనౌత్తో పాటు సింగర్ అద్నాన్ సమీ పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడ్డారు. ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన సెర్మనీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ వేడుకలో కంగనా గ్రీన్-గోల్డెన్ కలర్ చీరలో కనిపించగా.. అద్నాన్ సమీ గోల్డెన్ ఎంబ్రాయిడరీ గల బ్లాక్ షేర్వానీ ధరించాడు. ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, ఏక్తా కపూర్ కూడా పద్మశ్రీ జాబితాలో ఉండగా.. గతేడాది జనవరిలోనే ఈ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా తనతో విభేదాలున్న కరణ్కు సైతం పద్శశ్రీ వరించడం పట్ల గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగన.. ‘నేను అతనిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తను ఈ అవార్డుకు పూర్తిగా అర్హుడని భావిస్తున్నాను. కరణ్ ప్రొడ్యూస్ చేసిన ‘కేసరి, గుడ్ న్యూజ్’ వంటి సినిమాలు నిజంగా ప్రశంసనీయం. తండ్రి సపోర్ట్తో కెరీర్ ప్రారంభించినప్పటికీ తన స్వంత కృషి, యోగ్యత కారణంగానే అతను ఉన్నత స్థాయికి ఎదిగాడు’ అని తెలిపింది.
राष्ट्रपति रामनाथ कोविंद ने अभिनेत्री कंगना रनौत को पद्म श्री पुरस्कार से सम्मानित किया#PresidentKovind #PeoplesPadma pic.twitter.com/jwBjp8VD3v
— पीआईबी हिंदी (@PIBHindi) November 8, 2021