నో మాస్క్.. వారం రోజుల్లో 6 వేలకుపైగా కేసులు

by  |
నో మాస్క్.. వారం రోజుల్లో 6 వేలకుపైగా కేసులు
X

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో ప్రజలు మాస్క్‌లు ధరించడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ ఉదయం వరకూ మాస్కులు ధరించని వారిపై పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 6478 కేసులు బుక్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2030, రాచకొండలో 670, సైబరాబాద్‌లో 514 కేసులు నమోదు అయ్యాయి..

ఇక రామగుండం కమినషరేట్ పరిధిలో 938, వరంగల్ కమిషనరేట్ లో 218, ఖమ్మం కమిషనరేట్ లో 131, నిజామాబాద్ కమిషనరేట్ లో 70, సిద్దిపేట కమిషనరేట్ లో 9, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 8 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, మిగతా 20 జిల్లాల పరిధిలో 1890 కేసులు బుక్ అయ్యాయి. మొత్తంగా 6470 కేసులను పోలీసులు బుక్ చేశారు.

Next Story

Most Viewed