ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ధర్నా..

by  |
ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ధర్నా..
X

దిశ, వెబ్‌డెస్క్ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది గురువారం నిరసనకు దిగారు. కొవిడ్-19 విధుల్లో ఉన్న సిబ్బందికి ట్రాన్స్ పోర్టు సౌకర్యంతో పాటు, అదనపు వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చాలిచాలనీ వేతనాలతో కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కరోనా నేపథ్యంలో పబ్లిక్ రవాణా లేనందున డబ్బులన్నీ విధులకు వచ్చిపోవడానికే అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రజా సేవలో ఉన్నందున ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు.



Next Story

Most Viewed