మా లక్ష్యం ప్లేఆఫ్స్‌లో చోటు : కేఎల్ రాహుల్

by  |
మా లక్ష్యం ప్లేఆఫ్స్‌లో చోటు : కేఎల్ రాహుల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుత విజయం సాధిచింది. 150 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ టార్గెట్‌ను ఈజీగా చేధించింది. కాగా దీనిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ‘మా జట్టు వరుస విజయాలు సాధిస్తుండటం గర్వంగా ఉన్నది. మా జట్టు ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నది. ఎలాంటి పరిస్థితులను అయినా అధిగమించగలం అనే ధీమా ఏర్పడింది. ప్లేఆఫ్స్‌లో చోటు సంపాదించడమే మా లక్ష్యం. రాబోయే మ్యాచ్‌లలో కూడా ఇలాంటి ప్రదర్శనే ఇవ్వగలమనే అనుకుంటున్నాను.’ అని రాహుల్ వెల్లడించారు.

Next Story