చిన్నారులను ఆదుకోడానికొచ్చారు..

by  |
చిన్నారులను ఆదుకోడానికొచ్చారు..
X

దిశ, కరీంనగర్: చిన్నతనంలోనే తల్లి దండ్రులను కోల్పొయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు ఓయూ విద్యార్థులు మందుకు వచ్చారు. వివరాల్లోకివెళితే..కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లికి చెందిన సదానందం మూడు నెలల కిందట చనిపోగా, అతని భార్య కూడా ఇటీవలే అనారోగ్యంతో మరణించింది. దీంతో ఎవరూ లేని చిన్నారులను ఆదుకునేందుకు ఉస్మానియా యూనివర్శిటీ 2000 బ్యాచ్‌కు చెందిన ఎంఎస్సీ విద్యార్థులు అంజయ్య, లక్ పతి, లక్ష్మణ్, శ్రీకాంత్, సంతోష్, బుచ్చిరెడ్డి, చంద్ర శేఖర్, వెంకట్ రెడ్డి, శ్రీధర్, స్మిత, లక్ష్మీ కాంత్, నాగేశ్వర్ రావులు రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు.

Next Story

Most Viewed