సైంధవ్ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Disha Web Desk 6 |
సైంధవ్ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను కాంబోలో వచ్చిన తాజా సినిమా ‘సైంధవ్’. ఇది వెంకటేష్ 75వ మూవీ కావడంతో జనాల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రం జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ బాషల్లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సైంధవ్ ఓటీటీ పార్ట్‌నర్ వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ రెండూ సొంతం చేసుకున్నట్లు సమాచారం. సైంధవ్ ఫిబ్రవరి రెండో వారంలో మహా శివరాత్రి పండుగకు స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

Next Story

Most Viewed