- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: దేశంలో మరో ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకోనుంది. మరికొన్ని నెలల్లో అస్సాంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ‘‘క్రిషక్ ముక్తి సంగ్రామ్ పరిషత్’’ పేరుతో పార్టీ ఏర్పాటు కాబోతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పటికే ఆ పార్టీ సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించారు. అఖిల్ గోగోయ్ సీఎం అభ్యర్థిగా ఎన్నికల్లో పార్టీని నడిపిస్తారని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం అఖిల్ గోగోయ్ జైలు జీవితం గడుపుతున్నారు.
‘‘ అస్సాం రాజకీయ యవనికపై మరో పార్టీని తీసుకురావడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇది పూర్తిగా ప్రాంతీయ పార్టీయే. ముఖ్యంగా ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల నేతలు మా పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు.’’ అని క్రిషన్ ముక్తీ సంగ్రామ్ పార్టీ అధినేత భాస్కోదే సైకియా తెలిపారు. కాగా, అఖిల్ గోగోయ్ అక్టోబర్లో జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.