నాటిన మొక్కలను సంరక్షించాలి : ప్రియాంక

by  |
నాటిన మొక్కలను సంరక్షించాలి : ప్రియాంక
X

దిశ, మేడ్చల్: హరితహారంలో భాగంగా అందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి కొంపల్లి నుంచి మేడ్చల్ వరకు ఎన్‌హెచ్ హైవేపై 15కిలోమీటర్ల పరిధిలో హరితహారంలో నాటిన మొక్కలను ఆమె గురువారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… రోడ్లకు ఇరువైపులా పెద్ద ఏవెన్యూ ప్లాంటేషన్ చేయాలని కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్ మున్సిపల్ కమిషనర్లను అదేశించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు గుంతలు తవ్వి, ఎర్రమట్టి, సాసరింగ్ చేసి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed